మాదిగల చిరకాల స్వప్నం సాకారం
By J. Pullaiah 78చూసినవారుమంద కృష్ణ మాదిగ 30 ఏళ్ల ఉద్యమ ఫలితంగా ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై శుక్రవారం పెద్దకడబూరు నందు ఎమ్మార్పీఎస్, టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మార్పీఎస్ నేతలు లక్ష్మన్న, జంపన్న, శాంతిరాజు, టీడీపీ నేతలు తిక్కన్న, నరసన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. వర్గీకరణకు బాసటగా నిలిచిన టీడీపీ నేత రమాకాంతరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.