ప్రజాదరణతోనే వైఎస్సార్సీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయని, మాజీ పార్లమెంటు సభ్యురాలు, నియోజకవర్గ ఇన్ చార్జ్ శ్రీమతి బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, వైసీపీ సీనియర్ నేత రుద్రగౌడ్ స్పష్టం చేశారు. శనివారం ఎమ్మిగనూరులో వైసీపీ కార్యాలయంలో వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కార్యకర్తలు ఎవరూ అధైర్య పడొద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.