మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగికి రేపు గురువారం మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్రరెడ్డి వస్తున్నట్లు టీడీపీ మండల అధ్యక్షులు జ్ఞానేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాఘవేంద్రరెడ్డి పాల్గొని అవ్వాతాతలకు పింఛన్లు పంపిణీ చేస్తారని, కావున కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.