మంత్రాలయం పీఠంపై టీడీపీ జెండా ఎగుర వేస్తాం

569చూసినవారు
మంత్రాలయం పీఠంపై టీడీపీ జెండా ఎగుర వేస్తాం
మంత్రాలయం ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో టీడీపీ విజయం సాధిస్తుందని, కార్యకర్తలు సంయమనం పాటించాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి తెలిపారు. ఆదివారం మంత్రాలయం మండలం మాధవరంలో ఆయన మాట్లాడుతూ నాలుగో తేదీ జరగబోయే ఎన్నికల కౌంటింగ్ రోజున కూటమి నాయకులు సహనం కోల్పోకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చట్టాన్ని గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. మంత్రాలయం పీఠంపై టీడీపీ జెండా ఎగురుతుందన్నారు.

సంబంధిత పోస్ట్