మంత్రాలయం మండలం మాధవరం గ్రామ శివారులో ధ్వంసమైన గురు రాఘవేంద్ర స్టేజ్ -1 ప్రాజెక్టు ను రాజకీయాలకు అతీతంగా కలిసి కట్టుగా పని చేసి మరమ్మతుల పనులను పూర్తి చేద్దామని వైసీపీ నేత ప్రదీప్ రెడ్డి పిలుపునిచ్చారు. మాధవరం ఎత్తిపోతల పథకం నందు గుర్తు తెలియని వ్యక్తులు హై ఓల్టేజ్ మోటార్లను ధ్వంసం చేసిన సంఘటన స్థలాన్ని గురువారం పరిశీలించారు. పంపు హౌస్ లోని మోటార్లను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.