డిసెంబర్ 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని జూనియర్ సివిల్ జడ్జి వి. దివ్య తెలిపారు. బుధవారం నందికొట్కూరు స్థానిక కోర్టు నందు డిసెంబర్ 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహణపై దివ్య ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ లోక్ దాలత్ నందు క్రిమినల్ మరియు ఎక్సైజ్ కేసులో పరిష్కారానికి కృషి చేయాలని జడ్జి వారికీ సూచించారు.