జూపాడుబంగ్లా మండల కేంద్రంలోని ఏపీఆదర్శ పాఠశాలలో2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతి లో ప్రవేశ పరీక్ష ఈనెల 21న సోమవారం నిర్వహిస్తున్నట్లు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ దాసి రమేష్ శనివారం తెలిపారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం పది గంటల నుండి 12గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆదర్శ పాఠశాలలో బోధన మధ్యమం ఆంగ్లంలో ఉంటుందన్నారు.