కొత్తపల్లి మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు అధికారులు సమిష్టి కృషి చేయాలని ఎంపీపీ కుసుమలత జడ్పిటిసి సుధాకర్ రెడ్డి తెలిపారు. శనివారం మండల కేంద్రమైనలో ఉన్న ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కుసుమలత అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్ చింతామణి సమావేశంలో పాల్గొన్నారు. మండల స్థాయి అధికారులతో ఎంపీడీవో మేరీ ఆధ్వర్యంలో శాఖల వారీగా తమ పరిధిలో ఉన్న ప్రభుత్వ పథకాలను సమావేశంలో వివరించారు.