ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో ఎవరైనా సమస్యలు సృష్టిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ ఆర్. జయశేఖర్ హెచ్చరించారు. గురువారం కొత్తపల్లి మండలంలోని సిద్ధేశ్వరం నీటి ముంపు భూముల వద్ద స్థానిక, స్థానికేత భూ నిర్వాసితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధేశ్వరం భూములపై 145 సెక్షన్ అమలులో ఉందని ఆ ప్రభుత్వ నిబందనలు తొలిగిపోయే వరకు ఎవ్వరూ కూడా ఆ భూములవైపు వెల్లోద్దని, అక్కడ ఎటువంటి పనులు చేయకూడదని హెచ్చరించారు.