నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలము శింగరాజుపల్లె గ్రామంలో స్వస్తిశ్రీ విశ్వావసు నామ సం. ర వైశాఖ శుద్ధ ద్వాదశీ శుక్రవారము హస్తానక్షత్రయుక్త మిథునలగ్న శుభపుష్కరాంశమందు శ్రీ సీతారామచంద్ర స్వామి, కామాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి, పరివార దేవతల నాభి శిల విగ్రహా ప్రతిష్ట మహోత్సవం శాస్త్రానుసారాంగా నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసశర్మ పర్యవేక్షణలో వేదపండితుల మంత్రోత్సరణల మధ్య నిర్వహించారు.