నందికొట్కూరు బైరెడ్డి నగర్లో రూ.2.37 కోట్ల NDRF నిధులతో నిర్మించనున్న అగ్నిమాపక కేంద్రానికి శనివారం భూమిపూజ జరగ్గా, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ప్రారంభం చేశారు. ప్రజల భద్రతే మా లక్ష్యం. అగ్ని ప్రమాదాల నివారణకు ఇది కీలక అడుగు అని ఎంపీ తెలిపారు. ఆధునిక వసతులతో అగ్నిమాపక కేంద్రం త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులు తెలిపారు.