నంద్యాల జిల్లా పాములపాడు, ఎర్రగూడూరు శివారులో చట్టవ్యతిరేక కార్యకలాపాలపై SI సురేష్ బాబు ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాలతో మానిటరింగ్ నిర్వహించారు. బహిరంగంగా మద్యం సేవించడం, పేకాట వంటి కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ శుక్రవారం 2 ఓపెన్ డ్రింకింగ్ కేసులు గుర్తించి చర్యలు తీసుకున్నారు. ప్రజల భద్రత కోసమే ఈ తహతహ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.