నందికొట్కూరు పట్టణంలో నాటుసారా తయారీ గుట్టును ఎక్సైజ్ అధికారులు బుధవారం పట్టు బట్టలు తీసి అరెస్ట్ చేశారు. జగనన్న కాలనీలో మంగలి శ్రీనివాసులు ఇంటిని అద్దెకు తీసుకున్న షికారి రవి, నానా సింగ్, భారతి అనే ముగ్గురు 132 లీటర్ల నాటుసారా తయారు చేస్తూ పట్టుబడ్డారు. 600 లీటర్ల పులిసిన బెల్లం పూట ధ్వంసం చేయగా, మంగలి శ్రీనివాసులు, షికారి రవిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.