ఉపాధిహామీ పనుల పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే ఆందోళన చేపడుతామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం. నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం నందికొట్కూరు మండలంలోని దామ గట్ల గ్రామం, మిడుతూరు మండలంలోని నాగలూటి గ్రామంలో వ్యాకాస మండల నాయకులు బి. బాలస్వామి తో కలిసి పర్యటించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ. ఉపాధి హామీ చట్టం ప్రకారం పని చేసిన కూలీలకు ప్రతి వారం బిల్లుల చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.