ఆపరేషన్ సింధూర్లో కాశ్మీర్ బోర్డర్ వద్ద పాకిస్తాన్ సైన్యం కాల్పుల్లో ఆర్మీ జవాన్ మురళి నాయక్ వీరమరణం పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఈ జవాన్ ప్రాణత్యాగం దేశానికి తీరని లోటుగా నిలుస్తుంది. అమర జవాన్కు నివాళులర్పిస్తున్నట్టు మంత్రి నశ్యం మహ్మద్ ఫరూక్ సంతాపం తెలిపారు. మురళి నాయక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.