సి. బెళగల్ మండలంలోని చింతమానుపల్లె గ్రామంలో ఆగ్ని ప్రమాదం జరిగింది. రైతు భాస్కరరెడ్డికి చెందిన దాదాపు లక్షన్నర రూపాయల విలువైన గడ్డివాము గురువారం అగ్నికి ఆహుతైంది. మంటలు గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది చేరుకునేలోపే గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పశుగ్రాసాన్ని కల్లందొడ్డిలో నిలువ చేసుకున్నాడు. నష్టంతో రైతు ఆవేదన వ్యక్తంచేశారు.