నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి గురువారం తన నివాసంలో కల్లూరు ప్రాంత ప్రజల నుంచి వచ్చిన వినతి పత్రాలను స్వీకరించారు. వాటిని త్వరితగతిన పరిష్కరించేలా తక్షణ చర్యలు తీసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను అధికారులకు తెలియజేసి, శీఘ్ర పరిష్కారం వచ్చేలా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతి పత్రాన్ని ప్రాధాన్యతతో పరిశీలించి స్పందన ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.