నంద్యాల పట్టణంలో ఘనంగా స్వప్నవాసవదత్త పుస్తకావిష్కరణ

55చూసినవారు
నంద్యాల పట్టణంలో ఘనంగా స్వప్నవాసవదత్త పుస్తకావిష్కరణ
నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ రచయిత్రి డా. కొండూరి శ్రీదేవి రచించిన 60వ పుస్తకం స్వప్నవాసవదత్త పుస్తకావిష్కరణ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. సూరన సారస్వత సంఘం, మాతృభాషాపరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు వచనా, రచనా, ప్రక్రియకు సమగ్రత సమకూర్చే రచనలతో డా. శ్రీదేవి నంద్యాల ఖ్యాతిని ఇనుమడింపజేసిందని వక్తలు తెలిపారు.ఈ సందర్భంగా రచయిత్రిని డా. శ్రీదేవి ని ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్