కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆధ్వర్యంలో గురువారం హెల్మెట్ అవగాహన ర్యాలీని, అధునాతన ట్రాఫిక్ నియంత్రణ పరికరాలను ప్రారంభించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి, హెల్మెట్ ధరించి వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు 60 శాతం తగ్గుతాయని తెలిపారు. దాతల సహకారంతో 50 బారికేడ్స్ అందజేయగా, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 40 స్టిక్కర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.