జమ్మూ & కాశ్మీర్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులను సురక్షితంగా తీసుకురావాలని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్కు లేఖ రాసి, తక్షణ జోక్యం చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల స్థితిని ట్రాక్ చేయడం, కుటుంబాలకు సమాచారం చేరవేయడం, తరలింపు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.