నంద్యాల: ఉర్దూ భాష విలువపై అవగాహన

55చూసినవారు
నంద్యాల: ఉర్దూ భాష విలువపై అవగాహన
నంద్యాలలో ఉర్దూ భాషాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రూపొందించిన వాల్ పోస్టర్లను గురువారం మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆవిష్కరించారు. ఉర్దూ భాష గంగ జమున తేహజీబ్ కు ప్రతీకగా నిలుస్తుందని, ఇది మతాలకతీతంగా అందరినీ కలిపే భాషగా అభివర్ణించారు. ఉర్దూ నేర్చుకోవాలని, మాట్లాడాలని ప్రజలను ఆయన ప్రోత్సహించారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ మహమ్మద్ గౌస్ పీర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్