నంద్యాల తాలూకా ఎస్ఐ ఆధ్వర్యంలో గురువారం రైతునగరం, పరిసర ప్రాంతాల్లో డ్రోన్ సాయంతో పేకాట స్థావరాలు, నాటు సరాయి తయారీ, బహిరంగ మద్యపానంపై పోలీసులు నిఘా నిర్వహించారు. ఈ తనిఖీల్లో రెండు బహిరంగ మద్యం కేసులు నమోదయ్యాయి. ప్రజలలో అవగాహన పెంచేందుకు, నేరాల నిరోధానికి ఈ చర్యలు కొనసాగనున్నాయని వారు తెలిపారు.