ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నంద్యాల జిల్లా రెవెన్యూ అధికారి డి. రాము నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని డిఆర్ఓ ఛాంబర్ లో ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై డిఆర్ఓ సమావేశం నిర్వహించారు. సమావేశంలో డిఐఓ సునీత, డిఈసి మెంబెర్స్ రామన్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.