నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్లో ఫారుక్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ను శుక్రవారం టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ప్రారంభించారు. మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పుట్టినరోజు సందర్భంగా టోర్నీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఫయాజ్ మాట్లాడుతూ క్రీడలు యువతలో ఉత్సాహాన్ని పెంచుతాయని, ఆరోగ్యానికి మేలు చేస్తాయని అన్నారు. టోర్నీలో నియోజకవర్గవ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొన్నారు.