మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో న్యాయ, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి అర్జీపై అధికారులకు సూచనలు పంపుతూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మన్నె సుబ్బారెడ్డి, టీడీపీ నేతలు పాల్గొన్నారు.