రాయలసీమ ప్రాంతాల నుండి వచ్చిన బుడగ జంగం సముదాయ ప్రజలను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గురువారం తన నివాసంలో కలిసి వారి సమస్యలు, ఆశయాలపై చర్చించారు. అదే సముదాయానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థులు మంచి మార్కులు సాధించినందుకు ఎంపీ శబరి వారిని అభినందించారు. భవిష్యత్తులో విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తానని భరోసా కల్పించారు.