నంద్యాల బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు అడ్వకేట్ హుస్సేన్ భాష, న్యాయశాఖ మంత్రి ఎన్. ఎం. డి. ఫరూక్ను మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం రాజ్ టాకీస్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో అడ్వకేట్లు సాయిరాం రాయల్, మిట్నాల రాజేశ్వర్ రెడ్డి, తోట మురళీమోహన్ తదితరులు కూడా పాల్గొన్నారు. తాజా ఎన్నికల సందర్భంగా శుభాకాంక్షలు అందుకున్న హుస్సేన్ భాషకు మంత్రి ఫరూక్ అభినందనలు తెలిపారు.