నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సమాజ సేవలో ఫూలే చేసిన కృషిని ఈ సందర్భంగా అధికారులు స్మరించుకున్నారు.