నంద్యాల: జర్నలిస్టు రాష్ట్ర కమిటీ ఎంపిక

69చూసినవారు
నంద్యాల: జర్నలిస్టు రాష్ట్ర కమిటీ ఎంపిక
నంద్యాల ఐరా కార్యాలయంలో శుక్రవారం జర్నలిస్టు రాష్ట్ర కమిటీ ఎంపిక జరిగింది. జాతీయ ప్రధాన కార్యదర్శి జహంగీర్ ఆదేశాల మేరకు జాషువా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా జయప్రకాష్ నారాయణ, ప్రధాన కార్యదర్శిగా ఎం. శరత్ బాబు, ఉపాధ్యక్షుడిగా విజయ్ బాబు బాధ్యతలు స్వీకరించారు. నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా రంగారావు ఎంపికయ్యారు. జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యమని నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్