నంద్యాల: జవాన్ మురళీ నాయక్ వీరమరణం బాధాకరం

80చూసినవారు
నంద్యాల: జవాన్ మురళీ నాయక్ వీరమరణం బాధాకరం
శతజయంతి ఉత్సవాల సందర్భంగా నంద్యాల సీపీఐ సమితి శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో, పాకిస్తాన్‌తో యుద్ధంలో శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం పుట్టగుండ్లపల్లి తాండకు చెందిన మురళీ నాయక్ వీరమరణం పొందడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నామని తెలిపింది. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే. రామాంజనేయులు, సహాయ కార్యదర్శి ఎస్. బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ, జవాన్ ధైర్యసాహసాలకు సెల్యూట్ చేస్తూ, వారి కుటుంబానికి పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్