నంద్యాల గవర్నమెంట్ మహిళా కళాశాలలో శక్తి యాప్ ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గురువారం ఇన్ స్పెక్టర్ జయరాములు ఆధ్వర్యంలో శక్తి టీం బృందం రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వ్యాప్తి, బాల్య వివాహాలు, ర్యాగింగ్ లాంటి నేరాలపై విద్యార్థులకు విశేష అవగాహన కల్పించారు. తక్షణ పరిస్థితుల్లో ఉపయోగపడే టోల్ ఫ్రీ నంబర్లపై వివరించారు. మహిళలందరూ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.