ఈనెల 9 న జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలను ఘనంగా జరపాలని గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి వెంకట శివప్రసాద్ గిరిజనులకు నంద్యాలలో గురువారం పిలుపునిచ్చారు. స్థానిక గిరిజన సహాయ అధికారి ఉషనయ్య అధ్యక్షతన గిరిజన సంఘాల నేతల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, దళిత గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు డుమావత్ స్వామి నాయక్ మరియు ఇతర సంఘాల నేతలు హాజరయ్యారు.