పాణ్యం మండలంలో ఆలమూరు వద్ద విద్యుత్ డీప్ తీగలు తగిలి గడ్డి లోడు ట్రాక్టర్ దగ్ధమైంది. శుక్రవారం స్థానికుల సమాచారం మేరకు నందివర్గం నుండి ఆలమూరు వెళ్తున్న ట్రాక్టర్ కరెంట్ డీప్ తగలడంతో షార్ట్ సర్క్యూట్ సంభవించి, దీంతో ట్రాక్టర్లోని గడ్డి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో రైతుకు భారీ నష్టం వాటిల్లింది. స్థానికులు మంటలు ఆర్పేందుకు యత్నించినా ప్రయోజనం లేకపోయింది.