ఓర్వకల్లు జగనన్న కాలనీలో కరెంటు స్తంభాలకు లైట్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం సిపిఎం మండల కార్యదర్శి బి. నాగన్న, కార్యకర్తలు సుధాకర్ కాలనీలో కరెంటు స్తంభాలకు లైట్లు వేయాలని ఎంపీడీవో శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి నాగరాజుకు వినతిపత్రం అందించింది. విద్యుత్ శాఖ స్పందించి త్వరగా కరెంటు లైట్లు వేయించాలని కోరారు. ఎంపీడీవో సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.