ముమ్మరంగా పింఛన్ల పంపిణీ

73చూసినవారు
ముమ్మరంగా పింఛన్ల పంపిణీ
గడివేముల మండల వ్యాప్తంగా గురువారం నాడు ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఇంటింటా కొనసాగింది. మండల కేంద్రం గడివేములలో మండల కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పింఛన్లను పంపిణీ చేశారు. మొదటి రోజే దాదాపుగా పూర్తి స్థాయిలో పింఛన్ల ను ఉద్యోగులు కూటమి నాయకులు ఇంటింటికి తిరిగి పింఛన్దారులకు పింఛన్ సొమ్ము పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా కూటమి నాయకుల ఆధ్వర్యంలో పింఛన్ పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్