ఓర్వకల్లు మండలం శకునాలలో చెన్నకేశవ స్వామి తిరుణాల సందర్భంగా జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు జరిగాయి. మంగళవారం పోటీలో మొదటి బహుమతి రూ.25 వేలు శకునాల గ్రామం గెలిచింది. 2వ బహుమతి రూ.20 వేలు వడ్డేమాన్, 3వ బహుమతి రూ.15 వేలు ముధవరం, 4వ బహుమతి రూ.10 వేలు నూతనపల్లి గ్రామాలకు చెందిన క్రీడాకారులకు లభించాయి. బహుమతులను మాజీ డిసిసి చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, మౌలీశ్వర్ రెడ్డి ప్రదానం చేశారు.