కల్లూరు అర్బన్ పరిధిలోని షరీఫ్ నగర్కు చెందిన దారుణ హత్యకు గురైన సంజన్న కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.5 లక్షల బీమా చెక్కును కుటుంబ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అందజేశారు. బుధవారం కల్లూరులో ఎంపీ బైరెడ్డి శబరి సూచనల మేరకే బాధిత కుటుంబానికి సీఎం చంద్రబాబు అందించిన ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జయరాముడు తదితరులు పాల్గొన్నారు.