ఈనెల 17వ తేదీన కర్నూలు జిల్లా నంద్యాల రోడ్డు వద్ద జరిగే స్వచ్చంద్ర, స్వర్ణాంధ్ర సభకు విజయవంతం చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి అన్నారు. బుధవారం కల్లూరు అర్బన్ పరిధిలోని మాధవి నగర్ క్యాంపు కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. సీఎం నారా చంద్రబాబు సభకు నియోజకవర్గంలోని ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పిలుపునిచ్చారు.