గడివేముల మండలం ఎల్కే తాండ గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. శనివారం విద్యుత్ షాక్తో వెంకట్ నాయక్ అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మేకల కోసం వేపాకు కోస్తుండగా పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలి షాక్ కు గురై కింద పడిపోయాడు. గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.