ఓర్వకల్లు మండలం కొమ్మరోలులో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర రథోత్సవ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. శుక్రవారం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దర్శనం చేసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో కలిసి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. స్వామివారి తేరు ఊరేగింపు ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.