గడివేములలో వ్యక్తి మిస్టరీ మిస్సింగ్

67చూసినవారు
గడివేములలో వ్యక్తి మిస్టరీ మిస్సింగ్
గడివేముల మండలానికి చెందిన గువ్వల రాజు (38) అనే వ్యక్తి అనుమానాస్పదంగా అదృశ్యమయ్యాడు. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజు భార్యతో మనస్పర్థల నేపథ్యంలో విడిగా ఉంటున్నారు. చివరిసారిగా ఏప్రిల్ 26న సెల్ షాప్‌లో ఫోన్ పెట్టి కనిపించలేదన్నారు. రాజు సోదరుడు గువ్వల జనార్ధన్, కోడుకు వెంకటేష్ లు గాలించిన ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్