కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టు కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేరుకున్నారు. శుక్రవారం ఆయనకు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు గౌరు చరిత, బొగ్గుల దస్తగిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు.