పాక్ కాల్పుల్లో వీరమరణం పొందిన మురళీ నాయక్కు సీఎం చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులు అర్పించారు. శుక్రవారం అనంతపురం పర్యటన అనంతరం కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టు కు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దేశరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరసైనికుడు మురళీ నాయక్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఎంపీ నాగరాజు, డీఐజీ కోయ ప్రవీణ్ నివాళులర్పించారు.