ఓర్వకల్లు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

58చూసినవారు
ఓర్వకల్లు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
ఓర్వకల్లు మండలం హుస్సేనాపురం వద్ద కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హుశేనాపురం గ్రామానికి చెందిన బోయ హనుమన్న (58) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. గురువారం పొలానికి వెళ్ళిపోతుండగా, కర్నూలు నుంచి నంద్యాల వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. హనుమన్నను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన భార్య కూడా ఇటీవలే మృతి చెందింది.

సంబంధిత పోస్ట్