పాణ్యం మండల కేంద్రంలో చెంచు కాలనీ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. శనివారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి నంద్యాల వైపు వెళ్తున్న కారు చెంచు కాలనీ సమీపంలో అదుపుతప్పి రోడ్డు డివైడర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. కాగా అందులో ప్రయాణిస్తున్న వారికి ఎవరికి ప్రాణానష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. కానీ కారు ముందు భాగం మాత్రం బాగా దెబ్బతిందన్నారు.