జమ్ముకాశ్మీర్ యుద్ధ భూమిలో అమరుడైన మురళి నాయక్కు శనివారం పాణ్యం సీఐ కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్సై నరేంద్రనాథ్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. పాణ్యం పోలీస్ స్టేషన్లో మాజీ సైనికులు, పోలీసు సిబ్బంది పాల్గొని యుద్ధంలో అమరుడైన మురళీనాయక్ సేవలను స్మరించుకున్నారు. దేశానికి సేవలందించిన వీరజవాన్నికి కృతజ్ఞతగా పూలమాలలు అర్పించి నివాళులు తెలిపారు. దేశానికి సేవలందించిన వీరజవాన్ సేవలను కొనియాడారు.