కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శుక్రవారం కల్లూరు మండల పరిషత్ ఆఫీసులో ఎంపీపీ బి. శారద అధ్యక్షతన చేపట్టిన సర్వసభ్య సమావేశానికి హాజరై, మాట్లాడారు. మండలస్థాయి అధికారులు మూడు నెలల్లో సాధించిన ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. రూ. 1. 06 కోట్లతో గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు అభివృద్ధి పనులు చేశామని ఈవోఆర్డీ సభ దృష్టికి తెచ్చారు.