పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండలం తిప్పాయపల్లె గ్రామంలో బుధవారం జరిగిన గ్రామ దేవర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. స్థానిక వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో అమ్మవారి ఆలయాల్లో కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.