ఈనెల 6వ తేదీన పాణ్యం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడారు. మండలస్థాయి అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, గ్రామాలు అధికారులు తప్పక హాజరు కావాలన్నారు. ఉదయం 11 గంటలకు మండల మీట్ ప్రారంభమవుతుందన్నారు. ఎంపీపీ అధ్యక్షతన జరగనున్న సమావేశానికి అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని సూచించారు.