ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. శనివారం పాణ్యం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, మండల అధ్యక్షుడు జయరాం రెడ్డి ప్రారంభించారు. ముందుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించి, వసతులపై ఆరా తీశారు. విద్యార్థులకు ఇంటర్మీడియట్ ఎంతో కీలకమైన దశ అని, నాణ్యమైన భోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.